Palani Swamy: జయలలిత ఎస్టేట్ గార్డ్ హత్యకేసులో.. పళనిస్వామిపై దాఖలైన పిటిషన్ కొట్టివేత

  • అనుమానాస్పద స్థితిలో గార్డ్ హత్య
  • వీడియో క్లిప్ ఆధారంగా పళనిపై పిటిషన్ 
  • నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
ఓ హత్య కేసులో తమిళనాడు సీఎం పళనిస్వామికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2017లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడ్ ఎస్టేట్‌లోఅక్కడి గార్డ్ ఓమ్‌ బహదూర్‌(40) అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు.

ఈ హత్యతో పళనిస్వామికి సంబంధం ఉందంటూ ఇటీవల ఓ మ్యాగజైన్ విడుదల చేసిన వీడియో క్లిప్ ఆధారంగా సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎస్టేట్ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆయన పిటిషన్‌‌లో కోరారు. ఈ కేసు విషయమై నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... రామస్వామి వేసిన పిటీషన్‌ను తోసిపుచ్చింది. కొందరు దుండగులు గార్డ్‌ను హత్య చేసి విలువైన పత్రాలు, వస్తువులను దోచుకెళ్లినట్టు అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు.  
Palani Swamy
Tamilnadu
Magazine
CBI
Ramaswamy
Supreme Court

More Telugu News