తెలంగాణ నేత మురళీధర్ రావును ప్రపంచానికే ఇష్టమైన జననేతగా అభివర్ణించిన మోదీ
- బీజేపీ జాతీయ మండలి సమావేశాలు
- హాజరైన 12 వేల మంది ప్రతినిధులు
- మోదీ నామస్మరణలో మునిగిన నేతలు
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పార్టీ చీఫ్ అమిత్ షాను ప్రశంసల్లో ముంచెత్తారు. అమిత్ షా మాట్లాడుతూ.. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని తగ్గించి కోట్లాదిమంది చిన్న వ్యాపారులను మోదీ ఆదుకున్నారని ప్రశంసించారు. ఈ ఇద్దరి జోడీ అపూర్వమంటూ మురళీధర్ రావు కొనియాడారు. ఇక ఆ తర్వాత మాట్లాడిన మంత్రులు రాజ్నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్లు కూడా మోదీని పొగడ్తల్లో ముంచెత్తారు. ఇలా.. సమావేశం మొత్తం మోదీ నామస్మరణకే పరిమితమైంది.