kcr: కేసీఆర్ ను కలిసిన పువ్వాడ అజయ్ కుమార్

  • సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ధన్యవాదాలు తెలిపిన పువ్వాడ
  • ఈ ప్రాజెక్టుతో సుమారు 6.75 లక్షల ఎకరాలకు సాగునీరు
  • జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఖమ్మం టీఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల సాధనకు కృషి చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మీడియాతో పువ్వాడ అజయ్ మాట్లాడుతూ, సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లాల్లో సుమారు 6.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. వచ్చే జూన్ నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
kcr
puvvada ajay kumar
TRS
khammam
seetharama project

More Telugu News