YSRCP: ప్రజాసంకల్ప యాత్ర ఇంతటితో ముగిస్తున్నా.. ఈ పోరాటం ఇంకా కొనసాగుతుంది: వైఎస్ జగన్

షార్ట్స్‌లో చూడండి
‘ఈ ప్రజాసంకల్ప యాత్ర ఇంతటితో ముగిస్తున్నా.. ఈ పోరాటం ఇంకా కొనసాగుతుంది’ అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆయన ప్రజా సంకల్ప యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో ఎన్నికలు రావడానికి మరో మూడు నెలల కాలం ఉందని, ఈ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపాలని కోరారు. ఈ మూడు నెలల కాలంలో ప్రతిఒక్కరూ సహకరించాలని, ప్రతి ఒక్కరినీ తనకు తోడుగా రమ్మనమని కోరుతున్నానని అన్నారు.

చంద్రబాబునాయుడు వంటి నారా రాక్షసుడితోనే కాదు మనం యుద్ధం చేసేది, ఈ చంద్రబాబుకు తోడుగా ఎల్లో మీడియా ఉందని, వ్యవస్థను మేనేజ్ చేసే పరిస్థితులు ఉన్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో రెండు పత్రికలు, ఈ పెద్ద మనిషికి తోడుగా ఉన్న అనేక ఛానెల్స్ తో కూడా యుద్ధం చేస్తున్నామని అన్నారు. ఇవన్నీ కాక, జిత్తులమారి చంద్రబాబు అనేక పొత్తులు పెట్టుకుంటాడని, అన్యాయమైన కార్యక్రమాలు చేస్తాడని ఆరోపించారు.

ప్రజలంతా తనకు తోడుగా ఉంటే ఈ అన్యాయాలను, మోసాలను తాను కచ్చితంగా జయిస్తానని చెప్పారు. తోడుగా ఉండమని, ఆశీర్వదించమని, ప్రతి అక్కాచెల్లెకి, అవ్వాతాతకి, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి పేరుపేరున విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను’ అని జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.
Go Back to Shorts
YSRCP
ys jagan
Srikakulam District
ichhapuram

More Telugu News