Andhra Pradesh: లోయలోకి దూసుకెళ్లిన అయ్యప్ప భక్తుల కారు.. కడప వాసి దుర్మరణం!

షార్ట్స్‌లో చూడండి
అయ్యప్పస్వామి దర్శనానికి ప్రయాణికులతో వెళుతున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో కడపకు చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం తమిళనాడు సరిహద్దులో చోటుచేసుకుంది. కడప జిల్లా మండెం మండలానికి చెందిన అయ్యప్ప భక్తులు స్వామివారి దర్శనం కోసం కారులో శబరిమలకు బయలుదేరారు.

వాహనం తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశించి కొద్దిదూరం వెళ్లగానే అదుపు తప్పింది. వేగంగా పక్కనే ఉన్న లోయలోకి జారిపోయింది. ఈ ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు వెంటనే పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించారు. కాగా, ఈ దుర్ఘటనలో కడపకు చెందిన కృష్ణ దుర్మరణం చెందగా, గోపాలు, కృష్ణయ్య, వెంకటమ్మ తీవ్రంగా గాయపడ్డారు.

అధికారులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన తమిళనాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల తమిళనాడులో జరిగిన మరో ప్రమాదంలో తెలంగాణకు చెందిన 10 మంది అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Andhra Pradesh
Kadapa District
Telangana
ayyappa
Road Accident
1 dead
kerala

More Telugu News