charan: రాజమౌళి కథ చెప్పిన తరువాత ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి నాకు టైమ్ పట్టింది: చరణ్

  • మా ఇద్దరికీ రాజమౌళి ఒకేసారి కథ చెప్పారు 
  • నేను సాదా సీదాగానే కనిపిస్తాను 
  • ఎన్టీఆర్ లుక్ కొత్తగా ఉంటుంది  

చరణ్ .. కైరా అద్వాని జంటగా రూపొందిన 'వినయ విధేయ రామ' ఈ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో, ఈ సినిమా ప్రమోషన్స్ లో చరణ్ చాలా బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాజమౌళితో చేస్తోన్న సినిమాను గురించి కూడా ప్రస్తావించాడు.

"రాజమౌళి తన మల్టీస్టారర్ సినిమాకి మమ్మల్ని ఎంపిక చేసుకున్న తరువాత కథను రాసుకోలేదు. కథ పూర్తయిన తరువాతనే మమ్మల్ని ఎంచుకున్నారు. కథను నాకు .. ఎన్టీఆర్ కి ఆయన విడివిడిగా చెప్పలేదు. ఇద్దరినీ ఒకేచోట కూర్చోబెట్టి ఈ కథను వినిపించారు. కథ విన్న తరువాత ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి నాకు కాస్త సమయం పట్టింది. పక్కనే వున్న తారక్ ముందుగా రియాక్ట్ అయ్యాడు. అంతటి అద్భుతమైన కథను రాజమౌళి సిద్ధం చేశారు. ఈ సినిమాలో నేను సాదా సీదాగానే కనిపిస్తాను. తారక్ మాత్రం భిన్నంగా కనిపిస్తాడు. కొంతకాలం క్రితం తారక్ .. నేను కాలిఫోర్నియా వెళ్లింది కూడా ఈ సినిమా పనిమీదనే" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News