Pawan Kalyan: పొత్తులపై కసరత్తు చేస్తున్న జనసేన, వామపక్ష నేతలు

  • నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో సమావేశం
  • పోటీకి దింపాల్సిన అభ్యర్థుల జాబితా
  • ఏ స్థానం నుంచి ఏ పార్టీ పోటీ చేయాలి?

జనసేన, వామపక్షాలు ఎన్నికల పొత్తులపై కసరత్తు ప్రారంభించాయి. నేడు  హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఇరు పార్టీల ప్రముఖ నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై గంటపాటు చర్చ జరిగింది. ఎవరెవరికి ఎన్ని సీట్లు? ఎన్నికల్లో పోటీకి దింపాల్సిన అభ్యర్థుల జాబితా.. ఏ స్థానం నుంచి ఏ పార్టీ పోటీ చేయాలి? తమ పార్టీల కార్యకర్తల సంఖ్యను ఎలా పెంచుకోవాలి? తదితర అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. ఈ చర్చ అనంతరం ఇరు పార్టీల నేతలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లారు.

More Telugu News