బస్సులపై రాళ్లు రువ్విన కేసులో.. తమిళనాడు మంత్రి బాలకృష్ణారెడ్డికి మూడేళ్ల జైలు

  • హోసురులో బస్సులపై రాళ్లు రువ్వారు
  • ఈ ఘటన హింసకు దారితీసింది
  • ఎమ్మెల్యే, మంత్రి పదవులను కోల్పోనున్న బాలకృష్ణారెడ్డి
బస్సులపై రాళ్లు రువ్విన కేసులో తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీకి చెందిన క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి బాలకృష్ణారెడ్డికి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 1998లో హోసురులో బస్సులపై రాళ్లు రువ్విన ఘటన అప్పట్లో హింసకు దారితీసింది. దీనిపై నేడు మద్రాస్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో బాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే, మంత్రి పదవిని కోల్పోనున్నారు.  
Go Back to Shorts
Balakrishna Reddy
Special Court
Anna DMK
Hosuru
Tamilnadu

More Telugu News