Jagan: కేసీఆర్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా: వైఎస్ జగన్

  • హోదా కోసం లేఖ రాస్తానని కేసీఆర్ చెప్పారు
  • కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలతో పోరాడి గెలిచిన కేసీఆర్
  • ప్రజల్లో నమ్మకాన్ని పెంచబట్టే విజయమన్న జగన్
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సానుకూల వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ ను తాను స్వాగతిస్తున్నానని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసి, అవసరమైతే హోదా కోసం కేంద్రానికి లేఖ రాస్తానని ఆయన వ్యాఖ్యానించడం హర్షణీయమని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలతో పోరాడి కేసీఆర్ విజయం సాధించారని, గడచిన ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు చేసినట్టుగా కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలతో ఎన్నడూ సంసారం చేయలేదని, తనదైన పాలనతో ప్రజల్లో నమ్మకాన్ని పెంచారని అభిప్రాయపడ్డారు. హరికృష్ణ మృతదేహాన్ని పక్కన పెట్టుకుని, కలిసి పోటీ చేద్దామని కేటీఆర్ తో చంద్రబాబు మాట్లాడారని, చంద్రబాబు సంగతి తెలిసే టీఆర్ఎస్ పార్టీ ఆయన్ను పక్కన బెట్టిందని జగన్ అన్నారు.
Jagan
KCR
Andhra Pradesh
Telangana
Chandrababu
BJP
Congress
TRS
YSRCP
Telugudesam

More Telugu News