Jagan: జగన్ దాడి కేసులో ముగిసిన శ్రీనివాసరావు రిమాండ్.. ఎన్ఐఏకు అప్పగించే అవకాశం!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావు రిమాండ్ నేటితో ముగిసింది. ఈ కేసులో ఏకైక నిందితుడు కావడంతో భద్రతా కారణాల దృష్ట్యా అతడిని జైలులోనే ఉంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుపుతున్నారు. మరోవైపు జగన్ కేసును హైకోర్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించింది.

ఈ నేపథ్యంలో శ్రీనివాసరావును పోలీసులు మరికాసేపట్లో హైకోర్టు ముందు హాజరుపర్చనున్నారు. కాగా, శ్రీనివాసరావును ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తారా? లేక మరోసారి రిమాండ్ కు తరలిస్తారా? అన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కాగా, ఏపీలో విజయవాడలోనే ఎన్ఐఏ కోర్టు ఉండటంతో ఈ కేసు విశాఖ నుంచి విజయవాడ పట్టణానికి బదిలీ చేసే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతేడాది అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై శ్రీనివాసరావు కోడి కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Jagan
Andhra Pradesh
nia
srinivasa rao
attack
knife
High Court
YSRCP

More Telugu News