congress: గోల్కొండ హోటల్లో భేటీ అయిన కాంగ్రెస్ ముఖ్య నేతలు

  • హాజరైన కుంతియా, ఉత్తమ్, షబ్బీర్
  • ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష
  • తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థులతో చర్చ
హైదరాబాదులోని గోల్కొండ హోటల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను వీరు సమీక్షించారు. తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థులతో చర్చించారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి సలీం, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు షబ్బీర్ అలీ, సంపత్, దామోదర్ రెడ్డి, అద్దంకి దయాకర్ తదితరులు హాజరయ్యారు. 
congress
telangana
leaders
meet

More Telugu News