Madhya Pradesh: చేతులు కట్టేసుకుని... నదిలో దూకిన ప్రేమజంట!

  • నర్మదా నదిలో దూకి ఆత్మహత్య
  • 8 రోజుల తరువాత కనిపించిన మృతదేహాలు
  • కేసు దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు

వారి ప్రేమను పెద్దలు కాదన్నారో లేక మరేదైనా కష్టం వచ్చిందేమో... ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, మధ్యప్రదేశ్ లోని ఖల్ ఘాట్ సమీపంలోని నర్మదా నదిపై ఉన్న వంతెన మీద నుంచి ఓ ప్రేమ జంట నదిలోకి దూకగా, వారి మృతదేహాలు 8 రోజుల తరువాత లభ్యమయ్యాయి.

వీరి పేర్లు రాను, అరుణ్ లుగా గుర్తించారు. ఇద్దరూ సమీప బంధువులే. వీరి వద్ద ఓ ఫోటో లభించింది. ఇందులో యువతి మెడలో మంగళసూత్రం కనిపిస్తుండగా, ఇద్దరి చేతులనూ ఓ తాడుతో కట్టేసుకుని ఉన్నట్టు కనిపిస్తోంది. మృతదేహాలను తల్లిదండ్రులు, బంధుమిత్రులు గుర్తుపట్టి కన్నీరుమున్నీరయ్యారు. తమ కుటుంబాల మధ్య ఎటువంటి విభేదాలు లేవని, వీరిలా ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారో తెలియడం లేదని వాపోయారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News