Andhra Pradesh: అగ్రిగోల్డ్ ఆందోళనకారులతో ఏపీ ప్రభుత్వ చర్చలు సఫలం.. చెల్లింపులు మొదలుపెట్టనున్న ప్రభుత్వం!

  • జనవరి చివరి నుంచి చెల్లింపునకు అంగీకారం
  • హాయ్ లాండ్ కొనుగోలుదారులకు రాయితీలు
  • మీడియాకు వివరాలు వెల్లడించిన మంత్రి కాల్వ
అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నేతలు ముప్పాళ్ల వెంకటేశ్వరరావు, విశ్వేశ్వరరెడ్డితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో వీరంతా ఈరోజు ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆందోళనకారులను పరామర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపు ప్రక్రియను వెంటనే ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది.

ఈ విషయమై మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. జనవరి నెలాఖరు నుంచి అగ్రిగోల్డ్ చెల్లింపు ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. చిన్న మొత్తాల బాండ్లను తొలుత చెల్లిస్తామనీ, రూ.5 వేల బాండ్ల నుంచి దశలవారీగా మిగిలినవాటిని అందజేస్తామని వెల్లడించారు.

ఈ విషయమై జనవరి 12న కోర్టులో అఫిడవిట్ సైతం దాఖలు చేస్తామని పేర్కొంది. ఈ సందర్భంగా నోటిఫై చేయని ఆస్తులను జనవరి చివరిలోగా వేలం వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. హాయ్ ల్యాండ్ ఆస్తులను కొనేందుకు ముందుకొచ్చేవారికి రాయితీలు ఇస్తామని ప్రకటించారు.
Andhra Pradesh
agrigold
debt
talks
successful
kalva srinivasulu
Chandrababu
Telugudesam
government
agiatators

More Telugu News