Andhra Pradesh: ఆంధ్రా సీఆర్డీఏలో ఉద్యోగాల పేరిట మోసం.. తీవ్రంగా నష్టపోయిన యువకుడు!

షార్ట్స్‌లో చూడండి
మోసగాళ్లను నమ్మవద్దని అధికారులు ఎంతగా చెబుతున్నా చదువుకున్నవారు సైతం వినడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం అడ్డదారులు తొక్కుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఆర్డీఏలో ఉద్యోగం ఇప్పిస్తామని ఓ యువకుడికి ఓ జంట కుచ్చుటోపి పెట్టింది. అతని నుంచి భారీగా నగదును వసూలు చేసి పరారయింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని పెనమలూరుకు చెందిన విశ్వచైతన్య ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో సీఆర్డీఏలో ఖాళీలు ఉన్నాయనీ, కేవలం రూ.4 లక్షలు చెల్లిస్తే చాలని సతీశ్, నవనీత అనే దంపతులు అతడిని నమ్మబలికారు. దీంతో వీరిని నమ్మిన విశ్వచైతన్య వాళ్లు చెప్పినట్లే రూ.4 లక్షలు చేతిలో పెట్టాడు.

అయితే డబ్బు తీసుకున్న తర్వాత ఈ జంట అందుబాటులో లేకుండా పోయింది. అంతేకాకుండా ఫోన్ నంబర్ ను సైతం మార్చేసింది. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పెనమలూరు పోలీసులను ఆశ్రయించాడు. ఈ వ్యవహారంపై బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
CRDA
JOBS
Cheating
Krishna District

More Telugu News