యాదగిరిగుట్ట నవీనాలయం ప్రారంభ తేదీల ఖరారు!
- మార్చి 3 లేదా 13 బాగున్నాయి
- ఖరారు చేసిన త్రిదండి రామానుజ చిన జీయర్
- నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసిన అధికారులు
ఇప్పటికే సప్త రాజగోపురాలు, ధ్వజస్తంభ పీఠం, బలిహరణ పీఠం సిద్ధంకాగా, గర్భాలయంలో ఫ్లోరింగ్ పనులు జరుగుతున్నాయి. మరో మూడు వారాల్లోగా గర్భాలయ నిర్మాణం పూర్తి అవుతుందని, ఆపై మార్చిలోగా ఆలయ మాడవీధులు, రాజగోపురాల మధ్య శిల్పాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇదిలావుండగా, ఆలయ నిర్మాణ తీరును పరిశీలించేందుకు జనవరి మొదటి వారంలో కేసీఆర్ యాదాద్రిని సందర్శిస్తారని తెలుస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే కేసీఆర్ పర్యటన ఉండవచ్చని సమాచారం. పనులను పరిశీలించిన తరువాత ఆలయ ప్రారంభతేదీ అధికారికంగా ఖరారవుతుంది.