Andhra Pradesh: కేంద్రీయ విద్యాలయ అధ్యాపకుల నియామక పరీక్షలో గందరగోళం.. కృష్ణా జిల్లాలో అభ్యర్థుల ఆందోళన!

  • సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రశ్నాపత్రాల తారుమారు
  • ఆందోళనకు దిగిన టీచర్ అభ్యర్థులు
  • బాధితులను సముదాయించిన పోలీసులు
కేంద్రీయ విద్యాలయాల్లో అధ్యాపకుల నియామకం కోసం చేపట్టిన పరీక్షల్లో గందరగోళం తలెత్తింది. ఈ పరీక్షల నిర్వహణ సందర్భంగా అభ్యర్థులకు ఓ పేపర్ కు బదులుగా మరో పేపర్ ను నిర్వాహకులు అప్పగించడంతో బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు. చివరికి పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగడంతో సమస్య సద్దుమణిగింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని ఉయ్యూరులో ఉన్న విశ్వశాంతి పాఠశాలలో ఈరోజు కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ల పోస్టులకు జరిగింది. ఇందుకు దాదాపు 800 మంది హాజరయ్యారు. అయితే నిర్వాహకులు నిర్లక్ష్యంగా ఓ ప్రశ్నాపత్రానికి బదులుగా మరో ప్రశ్నాపత్రాన్ని అందించారు. ఈ వ్యవహారంతో కంగుతిన్న అభ్యర్థులు పరీక్షా హాలు బయటకు వచ్చి ఆందోళనకు దిగారు.

తాము ఓ సబ్జెక్టులో పరీక్ష రాసేందుకు వస్తే, మరో సబ్జెక్టు పేపర్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పొరపాటు జరిగిందని అంగీకరించిన అధికారులు.. పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. చివరికి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నచ్చజెప్పడంతో అభ్యర్థులు శాంతించారు.

More Telugu News

Andhra Pradesh
kendriya
vidyalaya
papers mixing
candidates
agitation