మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీకి తీవ్ర అస్వస్థత.. అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరిక!
- కడుపునొప్పితో బాధపడుతున్న ఎమ్మెల్యే
- ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వెల్లడి
- చాంద్రాయణ గుట్ట నుంచి గెలుపొందిన అక్బర్
ఇటీవల ఓ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ.. ‘కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా. నా కిడ్నీలు పూర్తిగా పాడయిపోయాయి. కిడ్నీల దగ్గర కొన్ని తూటాల ముక్కలు ఇంకా ఉన్నాయి. కొన్ని రోజుల కిందట పరిస్థితి చేయి దాటి పోయింది. డాక్టర్ నన్ను డయాలసిస్ చేసుకోమన్నారు. ఇవే నా చివరి ఎన్నికలు కావొచ్చు’ అని వ్యాఖ్యానించారు.