ఇంటెలిజెన్స్ బ్యూరో, ‘రా’ చీఫ్ల పదవీకాలం పొడిగింపు
- ఈ నెలాఖరుకు ముగియనున్న పదవీ కాలం
- రాజీవ్ జైన్, దస్మానా పదవీ కాలం ఆరు నెలల పొడిగింపు
- ఆదేశాలు జారీ చేసిన ఏసీసీ
1980 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రాజీవ్ జైన్ 30 డిసెంబరు 2016న ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా నియమితులయ్యారు. అలాగే, 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ధస్మానాను 29 డిసెంబరు 2016న ‘రా’ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. కాగా, నీతి ఆయోగ్లో సలహాదారుగా ఉన్న 1985 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అనిల్ శ్రీవాస్తవ స్థాయిని పెంచుతూ, ముఖ్య సలహాదారుగా నియమించింది.