YSRCP: జగన్ పై హత్యాయత్నం కేసులో సీఐఎస్ఎఫ్ రిపోర్టు సరిగ్గా లేదన్న హైకోర్టు... చివాట్లు!

  • మరో నివేదికను ఇవ్వండి
  • వారం రోజుల గడువు
  • విచారణ 21కి వాయిదా

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో సీఐఎస్ఎఫ్ ఇచ్చిన నివేదిక సరిగ్గా లేదని తెలుగు రాష్ట్రాల హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ రిపోర్టు లోపాలతో ఉందని చివాట్లు పెడుతూ, మరో నివేదికను 21వ తేదీలోగా ఇవ్వాలని ఆదేశిస్తూ, కేసు విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఈ కేసు విచారణను కేంద్రం అధీనంలోని స్వతంత్ర సంస్థతో జరిపించాలని, రాష్ట్ర విచారణపై తమకు నమ్మకం లేదని వైకాపా నేతలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

More Telugu News