TRS: మక్తల్, తుంగతుర్తి, సిరిసిల్ల, హుజూరాబాద్, జగిత్యాల... టీఆర్ఎస్ ఆధిక్యం

  • కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్లు తక్కువ
  • పూర్తయిన తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు
  • టీఆర్ఎస్ కు 300 నుంచి 700 ఓట్ల ఆధిక్యం
పో్స్టల్ బ్యాలెట్లు తక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఈవీఎంలను తెరచిన అధికారులు ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ఇప్పుడు అందుతున్న సమాచారాన్ని బట్టి, తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తి కాగా, మక్తల్, తుంగతుర్తి, సిరిసిల్ల, హుజూరాబాద్, జగిత్యాల నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. మొదటి రౌండ్ లో ఈ నియోజకవర్గాల్లో 300 నుంచి 700 ఓట్ల వరకూ టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. సిరిసిల్లలో టీఆర్ఎస్ యువనేత కేటీఆర్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
TRS
Telangana Election 2018
Telangana Assembly Election
Telangana Assembly Results

More Telugu News