ఉర్జిత్ అందుకే రాజీనామా చేశారు.. ఢిల్లీలో మహాకూటమి నేతల ఆరోపణ
- ఆ సొమ్మును కేంద్రానికి మళ్లించాలంటూ ఒత్తిడి
- ‘కాగ్’ను కూడా నియంత్రిస్తున్నారు
- సమావేశానికి ప్రాధాన్యం ఇవ్వకుండా చానళ్లను అడ్డుకున్నారు
ప్రభుత్వ సంస్థలను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నియంత్రిస్తోందని కూటమి నేతలు ఆరోపించారు. కాగ్ వంటి స్వతంత్ర సంస్థనూ మోదీ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఫెల్ నివేదిక ఇవ్వకుండా కాగ్పై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. మాజీ ప్రధానులు సహా దేశంలోని ముఖ్య నేతలందరూ సమావేశమైతే దానికి ప్రాధాన్యం ఇవ్వకుండా టీవీ చానళ్లను నియంత్రించారని, మోదీ నియంతృత్వ పాలనకు ఇంతకంటే ఉదాహరణ మరోటి ఉండదని కూటమి నేతలు ధ్వజమెత్తారు. పోరాటాలు, ఉద్యమాల ద్వారా కేంద్రం అవినీతిని వివిధ రూపాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని కూటమి నేతలు తీర్మానించారు.