రాజధాని చుట్టూ భూముల్ని చంద్రబాబు బినామీలే కొన్నారు: జగన్
- ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేస్తున్నారు
- రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది
- పేదల ఇంటి రుణాలన్నీ మాఫీ చేస్తాం
చంద్రబాబు ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని.. సీఎం రమేష్ కంపెనీకి వంశధార ప్రాజెక్టు పనులు కట్టబెట్టారన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం తన తండ్రి రూ.700 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పేదల ఇంటి రుణాలన్నీ మాఫీ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.