జగన్ ప్రజాసంకల్ప యాత్రపై తేనెటీగల దాడి.. తప్పించుకునేందుకు పరుగులు తీసిన నేతలు!

  • శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న జగన్
  • నేటికి 3,390 కిలోమీటర్లు పాదయాత్ర
  • జగన్ క్షేమంగానే ఉన్నారన్న వైసీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. 314వ రోజు యాత్రలో భాగంగా జగన్ పొందూరు మండలం నరసాపురం వద్ద పాదయాత్ర సాగుతోంది. ఈ నేపథ్యంలో పాదయాత్రలో పాల్గొంటున్న ప్రజలపై ఒక్కసారిగా తేనెటీగలు విరుచుకుపడ్డాయి. దీంతో తేనెటీగల నుంచి తప్పించుకునేందుకు నేతలు, కార్యకర్తలు పరుగులు తీశారు. కాగా, ఈ ఘటనలో జగన్ క్షేమంగానే ఉన్నారని వైపీసీ శ్రేణులు తెలిపాయి.

ఈరోజు ఉదయం రెడ్డి పేట నుంచి మొదలైన ప్రజాసంకల్ప యాత్ర లోలుగు, నందివాడ క్రాస్‌, నర్సాపురం అగ్రహారం, కేశవదాసుపురం క్రాస్‌, చిలకలపాలెం మీదుగా ఎచ్చెర్ల వరకూ సాగనుంది. చిలకల పాలెంలో ఈ రోజు సాయంత్రం జరిగే బహిరంగ సభలో జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పాదయాత్రలో భాగంగా జగన్ ఇప్పటివరకూ 3,390.3 కిలోమీటర్లు నడిచారు.
Go Back to Shorts
Andhra Pradesh
Jagan
YSRCP
bee attack
praja sankalpa yatra

More Telugu News