India: రూ.100 పెట్టి పెట్రోల్ కొనండి.. 5 లీటర్ల వరకు పెట్రోల్ ఫ్రీగా పట్టుకెళ్లండి!: ఎస్బీఐ ఆఫర్

  • బంపర్ ఆఫర్ గడువును పొడిగించిన ఎస్బీఐ
  • ఇండియన్ ఆయిల్ ఔట్ లెట్ల ద్వారా కొనుగోలు
  • కనీసం రూ.100 పెట్రోల్ కొనాలని నిబంధన

ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే అమలు చేస్తున్న ఉచిత పెట్రోల్ ఆఫర్ ను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ స్కీమ్ కింద వినియోగదారులకు ఉచితంగా 5 లీటర్ల పెట్రోల్ అందించనుంది. తాజాగా ఈ ఆఫర్ గడువును ఈ నెల 15వరకూ పొడిగిస్తున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఎస్బీఐ ట్విట్టర్ లో స్పందించింది.

‘ఎస్‌బీఐ కార్డు లేదా, భీమ్‌ ఎస్‌బీఐ పే ద్వారా ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్లలో పెట్రోలు కొంటే 5 లీటర్ల వరకూ పెట్రోల్ ను ఉచితంగా పొందవచ్చు. అయితే ఇందుకోసం ఇండియన్‌  ఆయిల్‌కు చెందిన ఏ పెట్రోల్‌ బంకులో అయినా కనీసం రూ.100 విలువైన పెట్రోలు కొనుగోలు చేయాలి. 2018 ఏప్రిల్ 1నాటికి 18 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న భారత పౌరులు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హులు. ఒక కస్టమర్ మళ్లీమళ్లీ కొనుగోళ్లకు పలు ఎంట్రీలను పంపవచ్చు. అయితే ప‍్రతీ ఎస్‌ఎంఎస్‌కు డిఫరెంట్‌ కోడ్‌ ఉండాలి’ అని ఎస్బీఐ తెలిపింది.

ఆఫర్ పొందే విధానం..

  • ఇండియన్ ఆయిల్ అవుట్లెట్ల నుండి రూ.100 విలువైన పెట్రోల్ ను కొనుగోలు చేయాలి. అదీ భీమ్‌, ఎస్‌బీఐకార్డు  ద్వారా చెల్లింపులకు మాత్రమే.
  • 12 అంకెల యూపీఐ రిఫరెన్స్ నంబర్ లేదా 6 అంకెల అధికార కోడ్‌ను 9222222084కు పంపాలి. 
  • భీమ్‌  ద్వారా చెల్లిస్తే 12 అంకెల రిఫరెన్స్ కోడ్‌ , ఎస్‌బీఐ కార్డుల ద్వారా చెల్లింపుల విషయంలో ఆరు అంకెల కోడ్‌ను నిర్దేశిత నంబరుకు ఎస్‌ఎంఎస్‌ చేయాలి.
  •  ఇలా కొనుగోలు చేసిన ఏడు రోజుల లోపు పంపించాల్సి వుటుంది.

అంతేకాదు, ఇలా అందిన ఎస్‌ఎంఎస్‌లలో ఎంపికచేసిన దానికి  50 ,100 ,150, 200 రూపాయలు స్పెషల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కూడా ఉంది. ప్రచార కాలంలో ఒక మొబైల్ నంబర్ గరిష్టంగా రెండు సార్లు ఈ ఆఫర్‌ పొందే అవకాశం. ఆఫర్‌ ముగిసిన రెండువారాల్లో విజేతలను ప్రకటిస్తారు. ఈ నగదును ఇండియన్ ఆయిల్ లాయల్టీ ప్రోగ్రాంలో రీడీమ్ చేసుకోవచ్చు.

More Telugu News