'ఆత్మస్తుతి పరనింద' అన్న చందంగా ఉంది టీఆర్ఎస్ తీరు: టీడీపీ నేత రావుల
- కూటమి అఖండ మెజారిటీతో గెలుస్తుంది
- తెలుగువారి కోసం టీడీపీ పనిచేస్తుంది
- లగడపాటిని విమర్శించడం సరికాదు
సర్వే చేసే హక్కు ఎవరికైనా ఉందని.. దానిని తప్పుబట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఆత్మస్తుతి పరనింద అన్న చందంగా టీఆర్ఎస్ తీరుందని విమర్శించారు. నాడు చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా ఉన్న కేసీఆర్.. నేడు టీడీపీని విమర్శించడం సరికాదన్నారు. నాడు సీపీఎస్ సర్వే సరైందన్న టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు లగడపాటిని విమర్శించడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు.