తెలంగాణలో ఓటేయనున్న 11 వేల మంది ఏపీ ఉద్యోగులు
- రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి కేటాయింపు
- ఏపీలో విధులు.. తెలంగాణలో ఓటు హక్కు
- డిసెంబరు 7 సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
మొత్తం మూడువేల మంది ఉద్యోగులు ఏపీ సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలిలో పనిచేస్తున్నారు. వీరంతా ఏపీలోనే పనిచేస్తున్నప్పటికీ ఓటుహక్కు మాత్రం తెలంగాణలోనే ఉంది. మొత్తం 11 వేల మంది ఏపీ ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యుల ఓట్లు కూడా తెలంగాణలోనే నమోదై ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా డిసెంబరు 7ను ఏపీ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.