సుజనా చౌదరిపై ఐటీ దాడులపై స్పందించిన చంద్రబాబు!
- బీజేపీ రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ట
- బెదిరింపు ధోరణికి భయపడేది లేదు
- తెలంగాణలో ప్రజా కూటమి గెలవాలన్న చంద్రబాబు
ఇప్పటివరకూ 24,11,556 మంది సభ్యత్వ నమోదు పూర్తయిందని, దీన్ని మరింత ముమ్మరం చేయాలని చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. వ్యవస్థ నిర్మాణం, వనరుల సమీకరణ విధానాల అమలు పకడ్బందీగా జరగాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 30న రాజమండ్రిలో 'బీసీ జయహో' భారీ సభను విజయవంతం చేసేందుకు నేతలంతా కృషి చేయాలని సూచించారు.
విడిపోయిన వేళ ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు అప్పుల్లో ఉండటానికి కేసీఆర్ విధానాలే కారణమని విమర్శించిన చంద్రబాబు, లోటు బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రగతిని సాధించిందని చెప్పారు.