లోక్సత్తా అధినేతగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. కొత్త పార్టీ ఏర్పాటు లేనట్టే?
- లక్ష్మీనారాయణ కొత్త పార్టీ లేనట్టే
- జేపీతో కలిసి ముందుకు
- నేడు అధికారిక ప్రకటన
లక్ష్మీనారాయణ తన ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా రిటైరైన తర్వాత ఏపీలో విస్తృతంగా పర్యటించారు. సమస్యలపై అధ్యయనం చేశారు. రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు కూడా. త్వరలోనే పార్టీ పేరును ప్రకటించబోతున్నట్టు తెలిపారు. ఇందుకోసం ‘జనధ్వని’ అనే పేరును కూడా అనుకున్నారు. అయితే, అకస్మాత్తుగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది.
కొత్త పార్టీని ఏర్పాటు చేసి దానిని నడిపించడం కంటే ఉన్న పార్టీని మరింత బలోపేతం చేయడమే మేలని భావించిన ఆయన తనలాంటి భావజాలమే కలిగిన జయప్రకాశ్ నారాయణతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో లోక్సత్తా పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించి పార్టీని బలోపేతం చేయాలని జయప్రకాశ్ కోరినట్టు సమాచారం. ఆయనకు సలహాలు సూచనలు ఇచ్చే బాధ్యతల్లో తాను వ్యవహరిస్తానని జేపీ చెప్పినట్టు సమాచారం.