jagan: కోడికత్తితో ఇప్పటికే పరువు పోగొట్టుకున్నారు.. మిగిలిన పరువునైనా కాపాడుకోండి: యరపతినేని

  • కోడికత్తి దాడితో మాకు సంబంధం ఏమిటి?
  • ఎలాంటి విచారణకైనా నేను సిద్ధమే
  • వైసీపీపై మండిపడ్డ యరపతినేని
వైసీపీ నేతలపై గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై కోడికత్తితో దాడి జరిగితే... ఆ దాడితో ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి ఆదినారాయణరెడ్డికి, తనకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే కోడికత్తి డ్రామాతో పరువుపోగొట్టుకున్నారని, మిగిలిన పరువునైనా కాపాడుకోవాలని హితవు పలికారు.

ఈనెల 23న మంత్రి నారా లోకేష్ గురజాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రెంటచింతలలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని చెప్పారు. ఈ సమావేశానికి మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ యాగంటి మల్లికార్జునరావు, టీడీపీ మండలాధ్యక్షుడు చపారపు అబ్బిరెడ్డి, ఎంపీపీ జీజాతుల నాయక్ తదితరులు హాజరయ్యారు. 
jagan
Chandrababu
adinarayana reddy
yarapatineni srinivasarao
gurajala
nara lokesh
YSRCP
Telugudesam

More Telugu News