భూరి విరాళాన్ని ప్రకటించిన వ్యక్తి... పిచ్చోడేమో పరిశీలించాలని కోర్టు ఆదేశం!
- భారీ డ్యామ్ నిర్మాణాన్ని తలపెట్టిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
- విరాళాలు ఇవ్వాలని ప్రజలకు పిలుపు
- యావదాస్తినీ ఇచ్చేసిన వ్యక్తి, స్పందించిన కోర్టు
దీనిపై స్పందించిన షేక్ షాహిద్ అనే వ్యక్తి, తనకున్న రూ. 8 కోట్ల విలువైన ఆస్తిని విరాళంగా ఇచ్చాడు. అతని నిర్ణయాన్ని వ్యతిరేకించిన భార్య కోర్టుకు ఎక్కింది. తన భర్తకు మానసిక వ్యాధి ఉందని ఆరోపించింది. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, షరియా చట్టాల ప్రకారం, వారసుల అనుమతి లేకుండా విరాళాలు ఇవ్వడం చెల్లదని చెబుతూ, అతని మానసిక స్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని వైద్యులను ఆదేశించింది.