మోదీ దుష్టపాలనకు చరమగీతం పాడాలి : కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్త, నటి ఖుష్బూ
- వ్యవస్థలన్నీ తిరోగమనంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ
- నోట్ల రద్దుతో చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం
- రాహుల్ ప్రధాని కావాలన్నది కాంగ్రెస్ వాదుల ఆకాంక్ష
మోదీ సర్వాధికారిలా వ్యవహరిస్తున్నారని సాక్షాత్తు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాంరాజన్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల్లో మోదీని గద్దె దించడం కూటమి ప్రధాన లక్ష్యమని, ఆ తర్వాత ప్రధాని ఎవరన్నది నిర్ణయిస్తారన్నారు.
రాహుల్ ప్రధాని కావాలన్నది కాంగ్రెస్ వాదుల బలమైన ఆకాంక్ష అని, ఈ విషయాన్ని నాయకులంతా కలిసి నిర్ణయిస్తారని చెప్పారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాహుల్గాంధీ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారని, ఎన్నికలు పూర్తయ్యాక తమిళనాడు రాష్ట్రంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తారని తెలిపారు.