Andhra Pradesh: తిత్లీ బాధితులకు ఊరట.. నేడు భారీగా నష్టపరిహారాన్ని అందించనున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్!

  • రికార్డు స్థాయిలో 24 రోజుల్లోనే సాయం
  • మరికాసేపట్లో శ్రీకాకుళంలో పర్యటన
  • పటిష్ట భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు
తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. దీని దెబ్బకు వేలాది ఎకరాల్లో పంట నాశనం కాగా, వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలామంది మత్స్యకారులు సర్వస్వం కోల్పోయారు. ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో కేవలం 24 రోజుల్లోనే తుపాను బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమయింది.

ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు జిల్లాలోని మందసలో తుపాను బాధితులకు మంత్రి లోకేశ్ నష్ట పరిహారం చెక్కులను అందజేయనున్నారు.

అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పలాస రైల్వే మైదానంలో సీఎం చంద్రబాబు, లోకేశ్ బాధితులకు చెక్కులను అందజేస్తారు. మొత్తం 19 మండలాల్లో దాదాపు 4.6 లక్షల మందికి రూ.530 కోట్ల భారీ పరిహారాన్ని ఏపీ ప్రభుత్వం ఈ సందర్భంగా చెల్లించనుంది. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు.
Andhra Pradesh
Srikakulam District
compensation
tour
titli storm
Chandrababu
Nara Lokesh
Telugudesam
government
24 days
help
record

More Telugu News