Pawan Kalyan: యూపీని నాలుగు ముక్కలు చేసే వరకు నా కడుపు మంట చల్లారదు: పవన్ కల్యాణ్

  • రాష్ట్ర నేతలకు ధైర్యం లేదు
  • ఒక ఓటు రెండు రాష్ట్రాలన్నప్పుడు ఎక్కడికెళ్లారు
  • బుద్ధి లేని నేతలు
ఉత్తరప్రదేశ్‌ను నాలుగు ముక్కలు చేసే వరకు తన కడుపు మంట చల్లారదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. బీజేపీపై తనకు చెప్పలేనంత కోపం ఉందన్నారు.

ఏపీ రాజకీయ నేతల్లో ఒక్కరికీ ధైర్యం లేదని, 1997లో కాకినాడలో ఒక ఓటు.. రెండు రాష్ట్రాలు అన్నప్పుడు నాయకులకు బుద్ధి ఉండొద్దా? అని ప్రశ్నించారు. మీరెవర్రా రాష్ట్రాన్ని విడదీయడానికి అని అడగొద్దా? అని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌ను కూడా అలాగే చీల్చుకుంటారా? అని నిలదీశారు. యూపీని నాలుగు ముక్కలు చేసే వరకు తమ కడుపు మంట చల్లారదని పవన్ పేర్కొన్నారు.
Pawan Kalyan
Jana sena
Andhra Pradesh
BJP

More Telugu News