వైసీపీ అధినేత జగన్ ట్రాప్ లో పడొద్దు.. టీడీపీ నేతలకు చంద్రబాబు సూచన!
- గత ఐదు రోజులుగా ఇదేచర్చ నడుస్తోంది
- అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు
- సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను దెబ్బకు నష్టపోయిన ప్రజలకు త్వరలోనే చెక్కులను పంపిణీ చేస్తామని తెలిపారు. వైసీపీ అధినేత జగన్ పై గత గురువారం వైజాగ్ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కోడి పందేల కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ జగన్ హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు. అనంతరం డిశ్చార్జ్ అయ్యారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ దాడి జరిగిందనీ వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, ఎయిర్ పోర్టు అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విషయమనీ, దానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పై హత్యాయత్నం ఘటనకు అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.