ayodhya: అయోధ్య కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదు: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

  • అలహాబాద్ తీర్పును సవాల్ చేస్తే పలు పిటిషన్లు దాఖలు
  • పిటిషన్లను విచారించిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం
  • సార్వత్రిక ఎన్నికలకు ముందు విచారణ అనవసరమన్న గొగోయ్
అయోధ్య రామ మందిరం- బాబ్రీ మసీదు కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. విచారణ తేదీలను, ధర్మాసనం వివరాలను వెల్లడిస్తామని ప్రకటించింది. 2010లో అలహాబాద్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి తీర్పును వెలువరించింది. ఆ సందర్భంగా ముగ్గురు న్యాయమూర్తులు మూడు రకాలైన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ పిటిషన్లను ఈరోజు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా గొగోయ్ మాట్లాడుతూ, వాస్తవానికి జనవరిలో కూడా ఈ పిటిషన్లపై విచారించాల్సిన అవసరం లేదని... సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు దీనిపై విచారణ అనవసరమని చెప్పారు. తరుపరి విచారణను జనవరికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి... నాలుగు నిమిషాల్లో విచారణను ముగించారు. 
ayodhya
babri maszid
Supreme Court

More Telugu News