శ్రీవారి అన్నదానానికి ‘మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా’ రూ.1.2 కోట్ల విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాద ట్రస్టుకు భారీ విరాళం అందింది. హైదరాబాద్‌లోని మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా ఇండియా లిమిటెడ్‌ కంపెనీ కోటీ ఇరవై లక్షల రూపాయలు అందించింది. నిన్న కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకున్న కంపెనీ డైరెక్టర్‌ వి.వి.సూర్యనారాయణరాజు భూపతిరాజు పూజల అనంతరం ఈ విరాళం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన డీడీని టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజుకు అందజేశారు.


More Telugu News