బీజేపీలో చేరిన ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ జి.మాధవన్ నాయర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కేరళలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతపరమైన అంశాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకపోవడమే మంచిదని వ్యాఖ్యానించారు. సొంతంగా రాకెట్‌ను ప్రయోగించే సామర్థ్యం లేని పాకిస్థాన్ 2022 నాటికి చైనా సాయంతో అంతరిక్షంలోకి మానవులను పంపిస్తామనడం హాస్యాస్పదమన్నారు.

2011లో ఆంటిక్స్-దేవాస్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత మాధవన్ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయకూడదంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వం నాయర్‌పై నిషేధం విధించింది. దీంతో అప్పటి నుంచి ఆయన బీజేపీ కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు నేరుగా బీజేపీలో చేరి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు.  
Go Back to Shorts
Madhavan Nair
ISRO
BJP
Kerala

More Telugu News