bjp: ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్న బీజేపీ: డొక్కా మాణిక్య వరప్రసాద్
- ‘బాహుబలి’లో కిలికిరి సైన్యంలా ప్రయత్నిస్తున్నారు
- రాయలసీమలో పారిశ్రామిక ప్రగతిపై చర్చకు సిద్ధమా?
- బీజేపీ నేతలకు సవాల్ విసిరిన డొక్కా
ఏపీలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడమే ధ్యేయంగా బీజేపీ నాయకులు మిడతల దండులా, ‘బాహుబలి’లో కిలికిరి సైన్యంలా ప్రయత్నిస్తున్నారని ఏపీ శాసనమండలి విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ మండిపడ్డారు. 4 ఏళ్లలో రాయలసీమలో జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.
రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్న కృషి కళ్లకు కనిపించడంలేదా? అంటూ ఆ పార్టీ నేతలను నిలదీశారు. ఏపీ సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ, బీజేపీ రాజకీయ సిద్ధాంతం ప్రాంతీయ విబేధాలపైనే ఆధారపడి ఉందని, దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి పబ్బం గడుపు కుంటున్నారని మండిపడ్డారు.
ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి రాకముందు ఆ రాష్ట్రాన్ని నాలుగు రాష్ట్రాలుగా విభజిస్తామని చెప్పి, ఇపుడు అధికారంలోకి వచ్చిన తరవాత విభజన ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. రాష్ట్ర పునర్విభజన కారణంగా ఏపీ తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిందని, సీఎం చంద్రబాబునాయుడు తన నాయకత్వ పటిమతో ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నారని అన్నారు. ఇది చూసి ఓర్వలేని బీజేపీ నాయకులు మిడతల దండులా, బాహుబలి సినిమాలోని కిలికిరి సైన్యంలా ఏపీలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
రాయలసీమ డిక్లరేషన్ అంటూ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్న బీజేపీ నాయకులు వెనుకబడిన ప్రాంతాలకు ఎందుకు ప్యాకేజీ ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, తిరుపతిని మొబైల్ మాన్యూఫాక్చరింగ్ హబ్ గా మార్చామని, దేశంలో తయారయ్యే 5 ఫోన్లలో ఒకటి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందేనని చెప్పారు.
నేడు తిరుపతిలో డిక్సన్ రెండో యూనిట్ ను సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారని, దేశంలో ఎలక్ట్రానిక్ హబ్ గా హర్యానాలోని గుర్ గామ్ మొదటిస్థానంలో ఉంటే, తిరుపతి రెండో స్థానంలో ఉందని అన్నారు. ఫాక్స్ కాన్, సెల్ కాన్, షియోమి, డిక్సన్ వంటి పెద్దపెద్ద మొబైల్ కంపెనీలు తిరుపతిలో ఉత్పత్తి ప్రారంభించాయని, వాటి ద్వారా వేలాది యువతకు ఉద్యోగావకాశాలు లభించాయని చెప్పారు.
అనంతపురంలో కియా కార్ల పరిశ్రమను ఏర్పాటు చేశామని, దీనివల్ల ఎందరికో ఉపాధి అవకాశాలు లభించాయని, నంద్యాలలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేశామని, దీనివల్ల దేశానికే విత్తనాలు సరఫరా చేసే స్థాయికి చేరుకున్నామని డొక్కా సంతోషం వ్యక్తం చేశారు. పెప్సీ, బర్గర్ పెయింట్స్ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చామని, నాలుగేళ్లలో చిత్తూరు జిల్లాలోనే 4 లక్షల మందికి ఉపాధి కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ ను కర్నూల్ లో స్థాపించామని,ఇవేవీ బీజేపీ నాయకులకు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. తమ నాలుగేళ్ల పాలనలో రాయలసీమలో పారిశ్రామిక ప్రగతిపై చర్చకు సిద్ధమా? అని బీజేపీ నాయకులకు ఆయన సవాల్ విసిరారు.
రాయలసీమలోని ఏ జిల్లాకైనా కలిసి వెళదామని, శ్రీ సిటీ కూడా చూద్దామని, గతంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి...తమ ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలో ఎంత పారిశ్రామిక ప్రగతి చేపట్టామో కళ్లకు కట్టినట్లు చూపిస్తామని డొక్కా అన్నారు. బీజేపీ నాయకులను తిరుపతికి తీసుకెళ్లడానికి బీజేపీ నాయకులకు అయ్యే ఖర్చును తామేభరిస్తామని అన్నారు.
వైసీపీతో బీజేపీకి ఉన్న ప్రేమాయాణాన్ని బయటపెట్టాలి
రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, సీఎం చంద్రబాబునాయుడుకు ఉన్న ఇమేజ్ తోనే రాష్ట్రానికి పరిశ్రమలు తరలి వస్తున్నాయని వెల్లడించారు. వైసీపీతో బీజేపీకి ఉన్న ప్రేమాయాణాన్ని కమలనాథులు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమపై చిత్తశుద్ధి ఉంటే, తక్షణమే కడప ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. నిలిచిపోయిన వెనుకబడిన ప్రాంతాలకిచ్చే నిధులను రాబట్టాలని, డిక్సన్ వంటి కంపెనీలు వస్తున్న సమయంలో ఏపీని అప్రదిష్టపాలు చేసేలా బీజేపీ నాయకులు వ్యవహరించొద్దని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలని చూస్తున్న బీజేపీ నాయకుల పట్ల ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డొక్కా మాణిక్యవరప్రసాద్ సూచించారు.
రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్న కృషి కళ్లకు కనిపించడంలేదా? అంటూ ఆ పార్టీ నేతలను నిలదీశారు. ఏపీ సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ, బీజేపీ రాజకీయ సిద్ధాంతం ప్రాంతీయ విబేధాలపైనే ఆధారపడి ఉందని, దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి పబ్బం గడుపు కుంటున్నారని మండిపడ్డారు.
ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి రాకముందు ఆ రాష్ట్రాన్ని నాలుగు రాష్ట్రాలుగా విభజిస్తామని చెప్పి, ఇపుడు అధికారంలోకి వచ్చిన తరవాత విభజన ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. రాష్ట్ర పునర్విభజన కారణంగా ఏపీ తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిందని, సీఎం చంద్రబాబునాయుడు తన నాయకత్వ పటిమతో ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నారని అన్నారు. ఇది చూసి ఓర్వలేని బీజేపీ నాయకులు మిడతల దండులా, బాహుబలి సినిమాలోని కిలికిరి సైన్యంలా ఏపీలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
రాయలసీమ డిక్లరేషన్ అంటూ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్న బీజేపీ నాయకులు వెనుకబడిన ప్రాంతాలకు ఎందుకు ప్యాకేజీ ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, తిరుపతిని మొబైల్ మాన్యూఫాక్చరింగ్ హబ్ గా మార్చామని, దేశంలో తయారయ్యే 5 ఫోన్లలో ఒకటి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందేనని చెప్పారు.
నేడు తిరుపతిలో డిక్సన్ రెండో యూనిట్ ను సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారని, దేశంలో ఎలక్ట్రానిక్ హబ్ గా హర్యానాలోని గుర్ గామ్ మొదటిస్థానంలో ఉంటే, తిరుపతి రెండో స్థానంలో ఉందని అన్నారు. ఫాక్స్ కాన్, సెల్ కాన్, షియోమి, డిక్సన్ వంటి పెద్దపెద్ద మొబైల్ కంపెనీలు తిరుపతిలో ఉత్పత్తి ప్రారంభించాయని, వాటి ద్వారా వేలాది యువతకు ఉద్యోగావకాశాలు లభించాయని చెప్పారు.
అనంతపురంలో కియా కార్ల పరిశ్రమను ఏర్పాటు చేశామని, దీనివల్ల ఎందరికో ఉపాధి అవకాశాలు లభించాయని, నంద్యాలలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేశామని, దీనివల్ల దేశానికే విత్తనాలు సరఫరా చేసే స్థాయికి చేరుకున్నామని డొక్కా సంతోషం వ్యక్తం చేశారు. పెప్సీ, బర్గర్ పెయింట్స్ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చామని, నాలుగేళ్లలో చిత్తూరు జిల్లాలోనే 4 లక్షల మందికి ఉపాధి కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ ను కర్నూల్ లో స్థాపించామని,ఇవేవీ బీజేపీ నాయకులకు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. తమ నాలుగేళ్ల పాలనలో రాయలసీమలో పారిశ్రామిక ప్రగతిపై చర్చకు సిద్ధమా? అని బీజేపీ నాయకులకు ఆయన సవాల్ విసిరారు.
రాయలసీమలోని ఏ జిల్లాకైనా కలిసి వెళదామని, శ్రీ సిటీ కూడా చూద్దామని, గతంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి...తమ ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలో ఎంత పారిశ్రామిక ప్రగతి చేపట్టామో కళ్లకు కట్టినట్లు చూపిస్తామని డొక్కా అన్నారు. బీజేపీ నాయకులను తిరుపతికి తీసుకెళ్లడానికి బీజేపీ నాయకులకు అయ్యే ఖర్చును తామేభరిస్తామని అన్నారు.
వైసీపీతో బీజేపీకి ఉన్న ప్రేమాయాణాన్ని బయటపెట్టాలి
రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, సీఎం చంద్రబాబునాయుడుకు ఉన్న ఇమేజ్ తోనే రాష్ట్రానికి పరిశ్రమలు తరలి వస్తున్నాయని వెల్లడించారు. వైసీపీతో బీజేపీకి ఉన్న ప్రేమాయాణాన్ని కమలనాథులు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమపై చిత్తశుద్ధి ఉంటే, తక్షణమే కడప ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. నిలిచిపోయిన వెనుకబడిన ప్రాంతాలకిచ్చే నిధులను రాబట్టాలని, డిక్సన్ వంటి కంపెనీలు వస్తున్న సమయంలో ఏపీని అప్రదిష్టపాలు చేసేలా బీజేపీ నాయకులు వ్యవహరించొద్దని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలని చూస్తున్న బీజేపీ నాయకుల పట్ల ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డొక్కా మాణిక్యవరప్రసాద్ సూచించారు.