రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల!
- వివరాలను వెల్లడించిన టీటీడీ
- స్వామివారి సేవా టికెట్లు ఆన్ లైన్ లో విడుదల
- ఎలక్ట్రానిక్ లాటరీ ద్వారా భక్తుల ఎంపిక
పేర్ల నమోదు తర్వాత అధికారులు ఎలక్ట్రానిక్ లాటరీ విధానం ద్వారా భక్తులను ఎంపిక చేస్తారు. ఇలా స్వామివారి సేవా టికెట్లను దక్కించుకున్న భక్తులు.. ఆన్ లైన్ లో నగదును చెల్లించాల్సి ఉంటుంది. కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్ల కోసం టీటీడీ వెబ్ సైట్ లో పేర్లను నమోదు చేసుకోవచ్చు. కాగా, టీటీడీలో భక్తుల అనుమానాలు, సమస్యలపై డయల్ టీటీడీ ఈవో కార్యక్రమంలో ఆలయ ఈవో అనిల్ కుమార్ భక్తుల సందేహాలను నివృత్తి చేస్తారు. భక్తులు 0877- 2263261 ఫోన్ నంబరు ద్వారా ఈవోతో మాట్లాడవచ్చు.