jagan: ‘రాఫెల్’ పై మాట్లాడాలంటే జగన్ జంకు.. పవన్ పరుగు!: టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్
రాఫెల్ కుంభకోణంపై మాట్లాడాలంటే జగన్ కు జంకు, పవన్ పరుగు అని టీడీపీ నేత లంకా దినకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ అంటే బాధ్యత లేని జగన్-పవన్ అని అభివర్ణించారు. బీజేపీ డైరెక్షన్ లో జగన్, పవన్ యాక్షన్ చేస్తున్నారని, జగన్ సావాసం తర్వాతే కేంద్రం రాఫెల్ స్కాంలో కూరుకుపోయిందని వ్యాఖ్యానించారు. ఏపీలో అత్యంత పారదర్శకత పాలన ఉందని కేంద్రమే ప్రకటించిందని, విపక్ష నేతలు అసత్యాలు మాట్లాడుకోవడం మానుకోవాలని హితవు పలికారు.