చంద్రబాబు, లోకేష్ ఆస్తులపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించండి: హైకోర్టులో పిటిషన్
- నాలుగేళ్లలో రూ. 25 వేల కోట్ల ఆస్తులను కూడబెట్టారు
- క్విడ్ ప్రోకో ద్వారా ప్రయోజనాలను పొందేందుకు వేమూరి రవికుమార్ ను ఉపయోగించుకుంటున్నారు
- 57,836 ఎకరాల భూమి కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయి
కంపెనీల నుంచి క్విడ్ ప్రోకో ద్వారా ప్రయోజనాలను పొందేందుకు రవికుమార్ ను చంద్రబాబు, లోకేష్ లు ఉపయోగించుకుంటున్నారని పిటిషనర్ తెలిపారు. వివిధ కంపెనీలకు కేటాయించిన 57,836 ఎకరాల భూముల్లో జరిగిన కొన్ని అక్రమాలను పిటిషన్ లో పేర్కొన్నారు. ఇన్నోవా సొల్యూషన్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థలకు విశాఖలో సుమారు రూ. 500 కోట్ల విలువ చేసే 40 ఎకరాల భూమిని నామమాత్రపు ధరకే కేటాయించారని ఆరోపించారు. 57,836 ఎకరాల భూమిని ఏయే కంపెనీకి ఎక్కడ, ఎంత స్థలం కేటాయించారనే విషయాలను ఏపీఐఐసీ పేర్కొనలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసినా సమాచారం ఇవ్వలేదని తెలిపారు.