ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్య షాక్‌కు గురిచేసింది: మంత్రి కేటీఆర్‌

విశాఖ జిల్లా ఏజెన్సీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటనతో షాక్‌కు గురయ్యానని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. 'ఇద్దరు నేతల హత్యతో చాలా ఆవేదనకు గురయ్యా. సివేరి సోమ నాకు 2009-14 మధ్య అసెంబ్లీలో సహచరుడు. బాధాకరమైన ఈ పరిస్థితుల్లో ఆ ఇద్దరు నేతల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను' అని పేర్కొన్నారు.


More Telugu News