ggh: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. రోగిపై మరో రోగి తనయుడి దాడి!

  • ఎముకల వార్డులో సంఘటన
  • తీవ్రంగా గాయపడ్డ ఖాజావలి 
  • అత్యవసర విభాగంలో చికిత్స 

గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) లో దారుణం జరిగింది. ఎముకల వార్డులో చికిత్స పొందుతున్న రోగిపై మరో రోగి కుమారుడు దాడి చేశాడు. బైక్ మెకానిక్ గా పనిచేస్తున్న ఖాజావలి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో, ఎముకల వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే వార్డులో ఖాజావలి పక్కనే ఉన్న బెడ్ పై రోగి గన్ సైదా కూడా చికిత్స పొందుతున్నాడు.

అయితే, గన్ సైదాకు ఆయన కుమారుడు షేక్ హుస్సేన్ కు మధ్య కొంతకాలంగా ఆస్తి వివాదం నడుస్తోంది. ఈ విషయమై మాట్లాడుతున్న సమయంలో గన్ సైదాకు అనుకూలంగా ఖాజావలి వ్యాఖ్యలు చేశాడు. దీంతో, ఆగ్రహించిన షేక్ హుస్సేన్ అక్కడే ఉన్న సర్జికల్ బ్లేడ్ తో ఖాజావలి గొంతు కోసేశాడు. దీంతో, తీవ్ర గాయమైంది. అత్యవసర చికిత్స విభాగానికి తరలించి ఖాజావలికి చికిత్స అందిస్తున్నారు. షేక్ హుస్సేన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News