madhavi: మాధవి తల్లి రెచ్చగొట్టడం వల్లే ఈ హత్యాయత్నం జరిగింది!: సందీప్ సంచలన వ్యాఖ్యలు

  • మాధవి తల్లికి కులం పట్టింపు ఎక్కువ
  • ఆస్తి లేకున్నా తమ కులం వాడికే ఇస్తామని చెప్పేవారు
  • ప్రేమ విషయాన్ని రెండుసార్లు ఇంట్లో చెప్పింది

ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ దగ్గర కుమార్తె మాధవి, అల్లుడు సందీప్ పై మామ మనోహరాచారి కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సందీప్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, మాధవి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఈ సందర్భంగా మీడియాతో సందీప్ మాట్లాడుతూ.. అసలు ఈ దారుణాలన్నింటికి కారణం తన అత్తేనని తెలిపాడు.

ఆమె పదేపదే కులం ముఖ్యమని మాధవికి చెప్పేదన్నాడు. ‘ఆస్తి లేకపోయినా మన కులం వాడినే పెళ్లి చేసుకోవాలి. బయటవాళ్లు వద్దేవద్దు’ అని మాధవికి బ్రెయిన్ వాష్ చేసేదన్నారు. కానీ  మాధవి తనను పెళ్లి చేసుకోవడంతో ఆమె మనోహరాచారిని రెచ్చగొట్టి ఈ హత్యాయత్నం చేయించిందని ఆరోపించాడు. తమ ప్రేమ గురించి 2015, 2018లో రెండు సార్లు మాధవి ఇంట్లో చెప్పిందని వెల్లడించాడు. దీంతో అప్పట్లోనే తనను చంపేస్తానని మాధవి తల్లి హెచ్చరించిందని అన్నాడు. కుమార్తెను చూడాలని ఉందని పిలిపించి దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుటుంబంతో మాధవి చక్కగా అమరిపోయిందని చెప్పాడు.

More Telugu News