Chandrababu: చంద్రబాబుకు లేఖ రాసిన కేరళ ముఖ్యమంత్రి!

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ రాశారు. భారీ వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకున్నందుకు లేఖలో ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు,సంస్థల సాయాన్ని కొనియాడారు. మీరు చేసిన సహాయం భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తోందని చెప్పారు. తోటివారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం భారతీయ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. మీరు చేసిన రూ. 40.18 కోట్ల సాయంలో... ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థలు రూ. 10 కోట్లు అందించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు.  
Go Back to Shorts
Chandrababu
pinarayi vijayan
letter
kerala
flood
donations

More Telugu News