jc diwakar reddy: అనంతపురం పోలీసుల లాఠీ చావ చచ్చిపోయింది: జేసీ దివాకర్ రెడ్డి

  • నేరగాళ్లకు పోలీసులు మర్యాదలు చేసే దుస్థితి నెలకొంది
  • ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోతోంది
  • సంచలనం రేపుతున్న జేసీ వ్యాఖ్యలు
ఎప్పుడూ రాజకీయాలు, రాజకీయ నేతలపై సెటైర్లు వేసే అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి... తాజాగా పోలీసు వ్యవస్థపై విమర్శలు గుప్పించారు. అనంతపురంలో అడ్మినిస్ట్రేషన్ మొత్తం దెబ్బతింటోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల లాఠీ చావ చచ్చిపోయిందని అన్నారు. నేరగాళ్లకు పోలీసులు మర్యాదలు చేసే దుస్థితి నెలకొందని విమర్శించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోతోందని అన్నారు. జేసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. 
jc diwakar reddy
anantapur
police

More Telugu News