liquor: ఇది 'మందు'బాబులను దోపిడీ చేయడమే!: ఉండవల్లి

  • భారీ ధరకు అమ్మడంపై మండిపాటు
  • స్ట్రైక్ చేస్తే ప్రభుత్వం అల్లాడిపోతుందని హెచ్చరిక
  • 1.30 లక్షల కోట్ల అప్పును ఏం చేశారని ప్రశ్న
 ప్రభుత్వం మద్యాన్ని ఎక్కువ ధరకు అమ్మడంపై పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో ఈ రోజు జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం రూ.8.50కు తయారయ్యే చీప్ లిక్కర్ ఒక్కో మద్యం బాటిల్ ను ప్రభుత్వం రూ.50కు అమ్ముతోందని మండిపడ్డారు. ఒక్కో బాటిల్ అమ్మినందుకు షాపు వాళ్లకి రూ.3.75 మిగులుతుందని, ఆ విధంగా ఒక్కో బాటిల్ పై ప్రభుత్వం రూ.37.75 లను దోచుకుంటోందని విమర్శించారు.

మందు బాబులు ఓ వారం రోజులు స్ట్రైక్ చేస్తే ప్రభుత్వాలు అల్లాడిపోతాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా కొన్ని బ్రాండ్ల మందు బాటిళ్లను ఉండవల్లి మీడియా సమావేశంలో ప్రదర్శించారు. గత నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం రూ.1.30 లక్షల కోట్ల అప్పు తీసుకుందనీ, ఈ నిధులను ఎక్కడికి మళ్లించారో చెప్పాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై పలువురు తనను సంప్రదిస్తున్నారనీ, ఉద్యోగాలు వదిలేసి రాజకీయాల్లోకి వస్తామని చాలామంది అంటున్నారని వెల్లడించారు.  
liquor
Chandrababu
Andhra Pradesh
Undavalli arun kumar
high rates

More Telugu News