kcr: కొంగరకలాన్ చేరుకున్న కేసీఆర్

  • బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో చేరుకున్న సీఎం
  • ఘన స్వాగతం పలికిన పార్టీ నేతలు 
  • తెలంగాణతల్లికి పూలు అర్పించి, నమస్కరించిన అధినేత 
ప్రగతి నివేదన సభ జరుగుతున్న కొంగరకలాన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. తన నివాసం ప్రగతి భవన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లి, అక్కడి నుంచి కొంగరకలాన్ కు ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ఆయన పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దాదాపు గంటన్నరసేపు ఆయన ప్రసంగం కొనసాగనుంది.

ఇక ఆయన రాకతో సభాప్రాంగణం మొత్తం జై కేసీఆర్ అనే నినాదాలతో మారుమోగుతోంది. సభావేదికపైకి చేరుకున్న కేసీఆర్... తెలంగాణతల్లికి పూలు అర్పించి, నమస్కరించారు. మరోవైపు కంట్రోల్ రూమ్ నుంచి ట్రాఫిక్ పరిస్థితిని డీజీపీ మహేందర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. సంబంధిత అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
kcr
pragathi nivedana sabha

More Telugu News