ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏరియల్ సర్వే నిర్వహించిన ప్రధాని మోదీ.. ఎటు చూసినా వరద నీరే.. వీడియో చూడండి

  • కేరళలో వరద బీభత్సాన్ని పరిశీలించిన మోదీ
  • చనిపోయినవారి కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా
  • తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 50 వేలు
భారీ వరదలతో అతలాకుతలమైన కేరళలో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఉదయం సర్వే నిర్వహించాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించలేదు. దీంతో, కేరళ గవర్నర్, సీఎంలతో ముందుగా ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత, ప్రతికూల పరిస్థితుల్లోనే ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద నీటిలో మునిగిపోయిన పట్టణాలు, గ్రామాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వరదల వల్ల చనిపోయివారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 50వేలు ఇస్తామని తెలిపారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నారు. వరదలతో విలవిల్లాడుతున్న కేరళకు తక్షణ సాయంగా రూ. 500 కోట్లు ఇస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. ఇది ఇంతకు ముందు ప్రకటించిన రూ. 100 కోట్లకు అదనం.
Go Back to Shorts
modi
kerala
floods
aerial view

More Telugu News