kcr: సోదరి లీలమ్మకు నివాళులర్పించిన కేసీఆర్ కన్నీటి పర్యంతం!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోదరి లీలమ్మ ఈ ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ ఈ వార్త తెలుసుకుని, హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరి వచ్చారు. అల్వాల్ లో సోదరి అంత్యక్రియలకు ఆయన హాజరయ్యారు. లీలమ్మ భౌతిక కాయానికి నివాళులర్పిస్తూ కేసీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు.

మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎంపీ కవిత కూడా కేసీఆర్ వెంట ఉన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు కేసీఆర్ ను పరామర్శించారు.
   
Go Back to Shorts
kcr
leelamma

More Telugu News